Search

Tuesday, July 5, 2016

జాంబవంతుని గుహలు 
(జంబువాన్ కేవ్స్) గుజరాత్  
























గుజరాత్  రాష్ట్రం మన భారత దేశానికే తలమానికం అని అనిపిస్తుంది. 
 శ్రీకృష్ణుడు నివసించినది మొదలు నిర్యాణం కూడా ఇదే  రాష్ట్రం లో  
జరిగాయి. మన పురాణాల ప్రకారం శ్రీకృష్ణునికి, జాంబవంతునికి యుద్ధం  
జరిగిన ప్రదేశం కూడా ఇదే రాష్ట్రంలో వుంది. 
               సోమనాథ్  నుంచి ద్వారకకి మేము   రోడ్డు  మార్గంలో  వస్తుంటే  
ఈ జాంబవంతుని  గుహలు చూశాము. ఈ గుహలు మహారాష్ట్ర లోని   
పోర్ బందర్  17  కి.మీ. దూరంలో  రాజ్ కోట్  కి  వెళ్ళే  రహదారిపై    
రణ్ వావ్ గ్రామంలో (Ranavav) వున్నాయి. అక్కడ   సిమెంట్ ఫాక్టరీకి   
దగ్గరలో వుంది.   వూరికి  దూరంగా  కొండల మధ్య  విశాలమైన ప్రదేశంలో 
వున్నాయి.  ఇక్కడే  శ్రీకృష్ణుడు  జాంబవంతుల  యుద్ధం  జరిగినట్లు, 
జాంబవతిని  వివాహం  చేసుకున్న ప్రదేశం  ఇది  అని  చెబుతారు.   
మహాభారతం లోని కధ అందరికి  తెలిసిందే! వినాయక వ్రతం రోజున  
అందరం  కధ చెప్పుకుని  అక్షింతలు వేసుకుంటాము.  జాంబ వంతుడు 
శమంతక మణిని జాంబవతికి ఆడుకోవటానికి ఇస్తాడు. తనపై మోపబడిన 
నింద రూపుమాప డానికై   ఆమణి కోసం  వెతుకుతూ  శ్రీకృష్ణుడు ఈ గుహ 
వద్దకు  వచ్చి జాంబ వంతునితో  యుద్ధం  చేస్తాడు.  త్రేతా యుగంలో  
రామునితో  యుద్ధం చేయాలనే కోరిక వున్న జాంబవంతుడు  ద్వాపర 
యుగంలో  శ్రీకృష్ణుడితో  యుద్ధం  చేసి తన  చిరకాల  వాంఛ  నెరవేర్చు 
కుంటాడు.  మణితో  పాటు  తన కుమార్తె నిచ్చి  శ్రీకృష్ణుతో వివాహం  
జరిపిస్తాడు జాంబవంతుడు.
           మేము వెళ్ళినపుడు  సన్నని మెట్లు దిగి  ఒక్కొక్కరు మాత్రమే  వెళ్ళే  
వీలున్న మెట్ల ద్వారా వెళ్ళాము.  
లోపల చీకటి గా వున్నా అక్కడక్కడా పైనుంచి  హోల్స్  వుం టం  వల్ల 
అక్కడక్కడ  వెలుతురూ  వుంది .  గుహలో  రోజూ చిన్న  శివుని  విగ్రహం, 
అభిషేకం పూజలు  చేస్తున్నట్లుగా వుంది . విశాలమైన  ఈ గుహలో లోపలి 
వెళ్తే అక్కడ  జాంబవంతుడు శ్రీకృష్ణుడికి జాంవంతునికి జాంబవంతుని  
వివాహం  చేస్తున్న పెద్ద  పెయింటింగ్  వుంది. 








ఇక్కడ వున్న శివలింగాలు పై నుంచి పడిన నీటి బిందువులతో ఏర్పడిన 
చాలా శివలింగాలు  వున్నాయి .  




















గుహ బయట మనకి ఒక పెద్ద బోర్డు కనిపిస్తుంది. గుహలోకి వెళ్ళిన వారు 
అక్కడి మట్టి రేణువులను సైతం ఎవరూ తీసుకు వెళ్ళకూడదు అని రాసారు. 
 ఒకవేళ  తీసుకు  వెడితే  ప్రభుత్వం  కఠిన శిక్ష  వేస్తుంది  అని రాసి వుంది.  
ఇంకో  బోర్డు లో గుజరాతీ  భాషలో ఇంకా  వివరంగా రాసి వుంది.  
మట్టి రేణువులు  తీసుకు  వెడితే ఇంట్లో  కూడా   గొడవలు  వస్తాయని  
రాసివుందని గుజరాతీ  భాష  తెలిసిన  వారు చదివి  చెప్పారు

ఈ గుహలో నుంచి రెండు దారులు  వున్నాయి. ఒకటి ద్వారకకి వెళ్తే, 
రెండోది జునాగడ్ కి వెళ్తుంది. ఈ రెండు  దారులూ రెండు , రెండున్నర 
గంటల్లో  గమ్యం చేరుకోవచ్చు.  గుజరాత్ ప్రభుత్వం  వారు  గుహలో  
అక్కడక్కడా లైట్స్  పెట్టారు.  

గుహలకి  బయట  చుట్టూ  వున్న పెద్ద తోటలో వచ్చిన వారు సేద తీరి, 
వెంట తెచ్చుకున్న భోజనాలు చేసి ఒక పిక్నిక్ లా ఎంజాయ్ చేస్తారు. 
అక్కడే  గుడి  కూడా   వుంది. మేము వెళ్లేసరికి  గుడి తలుపులు  మూసేశారు.
మేము అక్కడే  15 మందిమి కలిసి  భోజనం  చేసాము.  తిరిగి  ద్వారకకి 
బయలు దేరాము .
  

Kalaram Mandir, Nasik



 'కాలారాం'  ఆలయం


 





నాసిక్ లో మరో ప్రసిద్దమైన, అతి ప్రాచీనమైన  ఆలయం కాలరాం.   ఈ  ఆలయం పంచవటి సమీపంలో  వుంది.పంచవటి అంటే ఐదు వట వృక్షాలు ఒకే చోట వున్న ప్రదేశం.  
తండ్రి  ఆజ్ఞ  మేరకు  వనవాస మేగిన సీతారామ లక్ష్మమణులు ఇక్కడ గోదావరీ తీరాన పర్ణశాల  నిర్మించుకుని ఉన్నారుట.  ఆ ప్రదేశంలో  1790 లో ఈ నల్లరాతి ఆలయం నిర్మించారు.                                                                                                                                      



 



 
   హనుమాన్ మందిర్  దగ్గర 
                         
​                  
ఈ ఆలయం సర్దార్ రంగారావ్ ఓధేకర్   నల్ల రాతితో నిర్మించారు.  ఒకసారి ఒధేకర్  కి కలలో  గోదావరీ  నదిలో నల్లరాతి విగ్రహం శ్రీ రాముడిది వున్నట్లు  కనిపించిందిట.  మరునాడు  గోదావరి లో వెతకగా నిజంగానే  రాముని విగ్రహం  దొరికింది. ఆ ప్రదేశమే  నేడు రామకుండ్. అక్కడ దొరికిన   ఆ విగ్రహాన్ని  తెచ్చి  పంచవటి  ప్రాంతంలో    శావీ మాధవరావు పేష్వా సలహా ప్రకారం  ఆలయం నిర్మించారు.  ఆలయ ప్రధాన మూర్తులైన సీతారామ లక్ష్మణులు నల్లరాతితో వుంటాయి. అందుకే కాలారాం ఆలయం అనే పేరు వచ్చింది. ఈ ఆలయానికి నాలుగు దిక్కులా  నాలుగు ద్వారాలున్నాయి .  చుట్ట్టూ  ప్రహరీ గోడ మధ్యలో ఆలయం వుంది. ఆ రోజుల్లోనే 23 లక్షలు అయ్యాయిట 2000 మంది కూలీలు పనిచేసారు. పన్నెండు సంవత్సరాలు పట్టింది. ఆ నల్ల  రాతిని  రామసేజ్ పర్వత  నుంచి తీసుకు  వచ్చారు.  పగలు రాత్రి ధగ దగా మెరిసే  ఆలయ గోపుర కలశం బంగారు పూత పూసిన రాగి కలశం.
ఆలయ ప్రహరి గోడలు కూడా  చాలా ఎత్తులో  కట్టారు ఎత్తైన ఆలయ ప్రధాన ద్వారం దాటి  లోపలి  వెళ్ళగానే  మంటపంలో హనుమంతుడు దర్సన మిస్తాడు.ఈ హనుమ  విగ్రహం కూడా నల్ల రాతితో  చేసిందే! ఈ మంటపం హనుమాన్ చాలీసా లో లాగా  40 స్తంబాలతో చేశారు. 
ఆ తరువాత సీతారాముల ఆలయ ప్రవేశం కొద్ది ఎత్తులో (సుమారు 10 మెట్లు)  వుంటుంది.   
దత్తాత్రేయుడు ఇక్కడికి వచ్చినట్లు అయన పాద ముద్రలు కనిపిస్తాయి. విగ్రహం కూడా  వుంది.
చుట్టూ  96 స్తంబాలతో  మంటపం నిర్మించారు.  గణేషుడి మందిరం కూదా  వుంది. ప్రతి సంవత్సరం నవరాత్రి ఉత్సవాలు, శ్రీ రామనవమి ఉత్సవాలు  వైభవంగా  చేస్తారు. 
పర్యాటకులని  విశేషంగా ఆకర్షిస్తుంది ఈ కాలారాం ఆలయం.
  

ఆ రోజుల్లో కాలారాం ఆలయ ప్రవేశం దళితులకి  నిషిద్దం 
కాని డా. అంబేద్కర్  దళితులని కూడగట్టుకుని  మార్చ్ 2 1930నాడు  ఉద్యమం మొదలు  పెట్టారు.  వేలాదిమంది ఈ  ఉద్యమంలో  పాల్గొన్నారు. 5 సంవత్సరాలపాటు పోరాటం సాగించి చివరికి  విజయం సాధించారు.  ఇప్పుడు  అందరికీ  ప్రవేశం వుంది.  ఆ విశేషాలు  తెలిపే  రాతి ఫలకం ఆలయ  గోడలపై  ప్రభుత్వం  వారు  చెక్కారు.   
                             

      గోరా రాం సీతా రామ లక్ష్మణులు 



విశాలమైన, అతి పెద్దది అయిన కాలారాం  ఆలయం  వున్న  వీధిలోనే గోరారాం మందిరం కూదా  వుంది.  ఇది చాలా చిన్నది.  విగ్రహాలు కూదా  చిన్నవిగా, పాలరాతితో  చేసినవి  వున్నాయి.  


 - కోపల్లె మణినాథ్