Search

Wednesday, April 24, 2013

   

మహావీరుడు మహిళల కోసం ప్రవేశ పెట్టిన సంస్కరణలు

ఈ రోజు జైన్ మహావీరుడు జయంతి (23 04 2013)
ఈ సందర్భంగా వారి గురించి కొన్ని  విషయాలు.

భగవాన్ మహావీరుడు జైన మత గురువు.  తమ ఆర్ధ్య దైవంగా భావించే జైనులు స్త్రీలు పురుషులు సమానంగానే పూజిస్తారు. సాధారణం గా ఎన్నో నియమాలు పధతులు వున్నా తమ జీవన సాఫల్యం కోసం, జీవన్ ముక్తి కోసం జీవిస్తారు. మహిళలు ఎంతో మంది వీరి శిష్యులుగా వున్నారు. మహిళ లు  సమాజం లో వారి స్థానం , వారి విధులు విధానాలు అన్ని సంప్రదాయానుసారం పాటిస్తారు.  మహిళల అభివృధి కోసం జైన మతం ఎంతో పాటు పడుతోంది.  వీరి సమాజంలో మహిళలు ఎలా వుండేవారు , మహావీరుడు వారి అభివ్రుది కోసం చేసిన మంచి పనులు, ప్రముఖులైన మహిళలు ఇలాంటి విషయాలు తెలుసుకునే ముందు మహా వీరుని గురించి తెలుసుకుంటే బాగుంటుంది.
వర్ధమాన మహావీరుడు జైన మాత  స్థాపకులలో ముఖ్యులు. జిన అంటే విజేత అనే పదం నుంచి జైనం వచ్చింది. జీవన ప్రవాహాన్ని దాటడానికి వారధి నిర్మించిన వారు. జైన గ్రంధాలలో వీర, వీర ప్రభు, సన్మతి, అతివీర,  జ్ఞానపుత్ర వంటి పేర్లు కనిపిస్తాయి వర్ధమానుడు ఇరవై నాలుగవ తీర్థంకరుడు (జినుడు ). చివరి తీర్థంకరుడు కూడా!  జైన మతం అతి ప్రాచీనమైన మతం. మొదటి తీర్థంకరుడు వృషభనాధుడు. 23వ తీర్ధంకరుడు  పార్శ్వ నాధుడు.  ఇంతకు ముందు వున్నా తీర్థంకరులు కూడా జైన మతాన్ని  ప్రచారం చేశారు కాని మహావీరుడి కాలం లో అది ఎక్కువగా ప్రాచుర్యం లోకి వచ్చింది. జైన మతాన్ని శ్రమణ  మతమని కూడా అంటారు.  
మహావీరుడు 599లో కుంద గ్రామం వైశాలి లో రాజవంశంలో జన్మించాడు.  తండ్రి సిద్ధార్ధుడు . తల్లి  యశోధర. వీరిది జ్ఞాతృ వంశం.  నిర్గంధ సంప్రదాయం అంటే గ్రంధిరహితమైన  లేదా బంధవిముక్త   అని అర్ధం అందుకే మహావీరునికి  నిగంధనాత పుత్త అనే పేరు కూడా వుంది. భార్య త్రిశల. ప్రియదర్సి అనే పుత్రిక, అల్లుడు జామాలి. ఇతను మహావీరుని మొదటి శిష్యుడు.
మహావీరుని 28వ సంవత్సరంలో తల్లి తండ్రి మరణించారు.  కొంతకాలం అక్కడే వుండి తన ముఫై ఏళ్ల  వయసులో ఇలు వదిలి వెళ్ళాడు. తన ఆస్తిని తనకి సంబంధించిన అన్ని వస్తువులు యీదలకు దానం చేశారు.   అడవి ప్రాంతాలలో  పాదరక్షలు ధరించకుండా నడిచేవారు. పూర్తి  సన్యాసి జీవితాన్ని గడిపేవారు.   అక్కడ ఎవరితోనూ మాట్లాడేవాడు కారు. మౌనాన్ని పాటించేవారు. కాలి నడకన కొత్త కొత్త ప్రదెశాలు తిరిగేవారు.  ఉపవాస దీక్ష పాటించేవారు.  అడవుల్లో వుండే గిరిజనులు తరచూ ఆట పట్టిస్తూ వేదిస్తూ ఉండేవారు.   అయినా ఎప్పుడు పట్టించుకునేవాడు కాదు. కఠినమైన తపస్సు చేశారు.
సత్యాన్వేషియై  తిరిగిన ఆ మహావీరుడు పన్నెండేళ్ళు తపస్సు చేసారు. శరీరం సుస్కించి  పోయింది వైశాఖమాసం పదమూడవ రోజున జృమ్బిక గ్రామంలో అతనికి జ్ఞానోదయం (అంతర్ బుద్ది ) కలిగింది. మొదటిసారిగా ఒక బానిస అయిన చందన అనే మహిళ చేతి భోజనం చెసారు.  ఉత్తర భారత దేశం అంతటా తన జైత్ర యాత్ర చెసారు .  కాలినడకనే   తన తత్వాన్ని అంగ మిధిల, కోసల, మగధ దేశాలలో ప్రచారం చేశారు.   బీహార్, జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ ఒరిస్సా వంటి ప్రదేశాలు పర్యటించాడు.  జైన సంప్రదాయం లో మనిషి జీవన విధానం, వాటిని పాటించే తీరు చాల సులభంగానే వుండేది. జంతు బలులపై తన నిరసనని నిశ్శబ్దంగ తెలిపెవాడు. మహా వీరుని బోధనలు విద్యా వేత్తలు, పండితులు, పేద  గొప్ప, స్త్రీలు పురుషులు , రాజులూ రాణులు ఇలా ప్రతి ఒక్కరిని ఆకర్షించేవి. ఇతని వెంట చాలా మంది నడిచారు. బింబిసారుడు కూడా ఇతని శిష్యుడే!  తనలోని కర్మలని జయించిన నాడు ప్రతి వ్యక్తీ కూడా దేవుడే! ఎక్కడో వుండే దేవుని శోధించే కంటే మానవత్వం లో వుండే దేవుని చూడమనే వాడు.
    తన 43వ  ఏట సాల వృక్షం కింద తప: సిద్ది పొందాడు. జైన మతానుసారం సమ్యక్ దర్సనం, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ జీవనం అనే మోక్ష మార్గాలని త్రిరత్నాలు అని అంటారు . అహింస, సత్యం, అపరిగ్రహం,  అస్తేయం,  బ్రహ్మ చర్యం అనే వాటిని పంచ వ్రతాలు అంటారు.  బ్రహ్మ చర్యం పాటిస్తూ హింస చేయకుండా, అబద్ధ మాడకుండా, ఇతరుల ఆస్తిని కబళించకుండా, దొంగతనం చేయకుండా, వుండాలి  వీటిని పాటిస్తూ త్రి రత్నాలతో జీవించే వారికి కైవల్యం లభిస్తుందని మహావీరుడు బోధించే వాడు .
సన్యాసి అయిన వాడు శాకాహారాన్ని తీసుకొవాలి. అహింసను తప్పనిసరిగా పాటించాలి.   ప్రతి ప్రాణికి, వస్తువుకి కాని, అజీవులు అయిన వాటికి కాని చైతన్యం వుంటుందని వాటికి గాయాలైతే అవి బాధ పడతాయని అంటారు.  చివరికి భూమిలో వుండే వాన పాములు చనిపోతాయని భూమినే దున్నద్దు అని అన్నారు . అందుకే చాలామంది జైనులు వ్యాపారాలలో స్థిర పడ్డారు. గాలి పీలిస్తే గాల్లోని సూక్ష్మజీవులు చచ్చి పోతాయని మూతికి గుడ్డ కట్టుకుని తాగుతారు. నీళ్ళు వడకట్టుకుని తాగుతారు. అడుగు తీసి అడుగు వేసేటప్పుడు కాలి కింద పడి సూక్ష్మ జీవులు చచ్చిపోతాయని నెమలీకలతో చేసిన పొరకతో నడిచినంతమెర అడుగేసే ముందు  నేలను ఊడుస్తారు. నేల  కింద పండే దుంప కూరలు, ఉల్లి వెల్లుల్లి  మసూర్ గింజలు వంటివి కూడా తినరు.
తన డెభై రెండవ ఏట మహావీరుడు పావా జిల్లాలో నిర్యాణం పొందాడు.  జైన మతంలో శ్వేతాంబరులు దిగంబరులు అని రెండు తెగలుగా గా వుండే సన్యాసుల మధ్య తేడాలు లెవు.  కాని నిర్యాణం పొందటానికి నగ్నత్వం ముఖ్యం అని దిగంబరులు, కాదని స్వేతంబరులు భావించేవారు . స్త్రీలకూ విముక్తి లేదన్నారు కాని స్వేతంబరులలో 19వ తీర్ధంకరుడైన మల్లి నాదులు  స్త్రీలకూ విముక్తి వుందన్నారు . దేవాలయాలలో విగ్రహ పూజ దిగంబరులు చేస్తే శ్వేతాంబరులు పవిత్ర స్తానకాలలో వుండి జైన గ్రంధ బోధనలు చెబుతారు. కొంతమంది మాత్రం విగ్రహ పూజ కూడా చేస్తారు  మహావీరుని, తీర్ధంకరులను ఆలయాలలో దిగంబరులు పూజిస్తే  శ్వేతాంబరులు స్థానకాలలొ  వుంటూ ఒక చోటునుంచి ఇంకో చోటుకు  కాళీ నడకన వెళ్లి బిక్ష స్వీకరిస్తారు.
మహిళలు కూడా జైనమతం లో వున్న అన్నిటిని సంప్రదాయాలు పాటిస్తారు. పంచ సూత్రాలు వీరు కూడా పాటిస్తారు. స్త్రీ పురుషులు ఒకరికొకరు సాయ పడటం, మానవత్వం విషయం లోను, పర్యావరణాన్ని రక్షించటం లోను వీరు కూడా పాల్గొనవచ్చు. ఇరువురు సమానమే!
మహావీరుని ఆద్యాత్మిక బోధనలు మహిళలని ఎంతో ఆకర్షించేవి . చాలా మంది స్త్రీలు వీరి శిష్యులుగా మారారు. అంతిమ అనందం, సత్యం వెతుకులాటలో ఎంతో మంది మహిళలు కూడా చేరారు.  మహావీరుడు తన అనుచరులని నాలుగు తరగతులుగా (కేటగిరీలుగా) చేసారు. సాధుస్, సాద్విస్,  శ్రావక్స్, స్రావికాస్. ఈ క్రమాన్ని జైన్ సంఘంగా  పిలిచేవారు. జైన సాధువులను నేడు కూడా శ్రమణులనే పిలుస్తారు. వీరి  సంప్రదాయానికి జైనం అని పేరు వున్నా మహావీరుని కాలంలో దీనికి నిర్గ్రంధం అని  నిర్గ్రంద ప్రవచనం అని పిలిచేవారు. పార్శ్వనాధుని సమయంలో శ్రమణ  ధర్మం అనే పేరు వుంది. ఈ జైన సంప్రదాయానికి మూలమైన సిదాంతాన్ని ఆత్మ వాదమని అనేకాంత వాదమని అంటారు. బాహ్య భ్యం తరములైన వికారాలను అంటే క్రోధం, కామం, ఈర్ష్య, అసూయ మొదలైన వాటిని జయించిన వానికి జిన, జినుడు అని పేరు.  
భగవాన్ మహావీరుని బోధనలు అంగాంగ సూత్రాలుగా వర్ణించే వీటిని 12 గ్రంధాలుగా  అతని శిష్యులు రచించారు.  జైన్ సంప్రదాయాలని వివరిస్తూ వుండే వీటిని అగమ్  సూత్రాలు అని అంటారు. ముందు ఈ సూత్రాలు బోధనల ద్వారా మాత్రమే ప్రచారం అయ్యెవి.  వెయ్యి సంవత్సరాల తరువాత వాటిని ముందు తరాల కోసం తాళ  పత్ర గ్రందాల మీద రచించారు.  
మారుతున్న కాలంతో పాటు జైనిజంలో మార్పు వచ్చి స్త్రీ పురుషులిరువురు  తమ పిల్లలు కుటుంబ  సంక్షేమం కోసం,  జైనమత సంప్రదాయాన్ని  సమానంగానే రక్షించారు. పూర్వం లో మాదిరి గానే సన్యాసినులు గా కూడా మహిళలు జీవించవచ్చు. మహావీరుని సిద్దాంతాల పట్ల అనేక మంది మహిళలు ఆకర్షితులై ప్రపంచంలో ఆనంద లబ్ది కై వీరి వెంట నడిచారు . శ్రావకిలుగా ఎంతో  మంది మహిళలు వున్నారు.
జైన్ మత  సాధువులు సాధ్విమణులు తప్పక  ప్రత్యేకంగా తాయారు చేసిన  ధవళ వస్త్రాలు మాత్రమే ధరించాలి. వారి ఐదు సూత్రాలను తప్పక పాటించాలి. సూర్యోదయానికి ముందు సూర్య్దయం తరువాత తప్పనిసరిగా రోజుకు రెండుసార్లు అవస్యక్ చేయాలి.  సాద్విస్ తమకి తామే అన్ని పనులు చేసుకోవాలి. ఇతరుల సాయం తీసుకోరాదు. తప్పని పరిస్తితుల్లో తోటి సాద్విస్ సాయం మాత్రం తీసుకోవచ్చు.  తమ ఆహారాన్ని వండుకోగూడదు. ఇంటింటికి వెళ్లి తమకి కావలసిన కొద్ది ఆహారం నీరు మాత్రం తెచ్చు కోవాలి. అందరు నిజాయితీ తో  క్రమబద్దమైన  జీవితాన్ని గడపాలి నలుగురికి ఆదర్శం కావాలి.  
దిగంబర శాఖకు చెందిన వారు పురుషుల కంటే మహిళలను తక్కువగా భావిస్తారు. కొన్ని చోట్ల మహిళలని పవిత్రులు కాదని, సమానులు కాదని కూడా అంటారు.  శారీరకంగా ప్రతి నెలా వారికి సంభవించే రుతు కార్యక్రమం వల్ల వాళ్ళు సమానం కాదని అంటారు.అంతే  కాదు వారు ఈ ప్రాపంచిక విషయాలనుంచి విముక్తి పొందాలంటే మళ్లి  వీరు పురుష జన్మ ఎత్తాలి అని కుడా అంటారు. కాని శ్వేతాంబరులు మహిళలకి సమన హోదా కల్పిస్తుంటారు.   
19వ తీర్ధంకరుడు అయిన మల్లి నాధుడు పురుశుడని దిగంబరులు భావిస్తే శ్వేతాంబరులు స్త్రీ అయిన మల్లి కుమారి అని అంటారు. వారి గ్రంధాలలో మల్లి కుమారి జీవిత కథ కూడా వుంది. రేవతి, బ్రాహ్మి , సుందరి, సాద్విమణులైన పుష్పచుల (pushpachula ), రుద్రసోమ , రుక్మిణి, ఋషి దత్త,  ఇలా ఎందరో మహిళలు జైన మతాన్ని అనుసరించి సాద్విమణులుగా పేరు పొందారు.
             ఎంతో మంది పురుషులు స్త్రీలచే ప్రభావితులయ్యారు హేమచంద్రాచార్యులు తన తల్లి పాహిమి వల్ల  జ్ఞాన సముద్రులు అని పేరు పొందారు . అలాగే కవి అయిన ధనపాల్ తన సోదరి సుందరి ప్రోత్సాహం వాళ్ళ గ్రంధం అమరకోశం రచించారు. శ్రీదేవి, అనుపమ దేవి వంటి కూడా తమ భర్తలు ఆధ్యాతిమిక, వ్యాపార రంగాల్లో వృద్ది  చెందటానికి తోడ్పడ్డారు . ఈ తరంలో కూడా ఎంతో మంది సాద్విమణులు శ్రావిక లు కుడా ప్రసిద్ది పొందిన వారున్నారు.  మహాసతి ఉజ్వలకుమారి వ్యక్తిత్వం తెలిసి మహాత్మా గాంధీయే  స్వయంగా వెళ్లి ఆమెని కలిసారు. హర్కున్వర్ జెఠాణి  హతి సిన్హా ఎన్నో ఆలయాలు కట్టించారు.  ఎందఱో మహిళా మణులు ప్రసిద్ది చెందిన వారున్నారు.  మహావీరుని    జైన మతాన్ని అనుసరించిన మహిళలు సాధు మనస్త్వం  కలిగిన వారు గా వుంటారు.  అహింసని ఐదు ధర్మాలలో ఒకటిగా పాటించే వీరు సతి సహగమనాన్ని వ్యతిరెకిస్తారు.  మహిళలని బానిసలుగా వ్యాపారం చేసే పద్ధతిని, దాసీ విధానాన్ని వ్యతిరేకిస్తారు.  ఆ రోజుల్లో రాజైన మేఘ కుమార్ సంతోషం కోసం అనేక మంది స్త్రీలను బానిసలుగా వివిధ దేశాల నుంచి తీసుకు వచ్చేవారు .  భగవాన్ మహావీరుడు ఈ రకమైన బానిస విధానాన్ని చాల గట్టిగా వ్యతిరేకించే వారు.
ఆనాటి సమాజంలో వుండే జంతు బలులని నిషేధించటానికి సాధ్వి వక్షకున్వర్జి ఎంతో కష్ట పడవలసి వచ్చింది. బహు భార్యత్వం, మత్తు పదార్ధాలు సేవించటం, జూదం వంటి చెడు వ్యసనాలు వున్న  సమాజం లో స్త్రీలు ఎంతో హింసకి గురయ్యెవారు. వారిని రక్షించే వాళ్ళు.  
మహావీరుడు  స్త్రీ పురుషులిరువు సమానమే అని అనెవారు. మహావీరుడు  నిర్యాణం చెంది 2612 సంవత్సరాలు అయినా నేటికి వారు చిరంజీవియే! దేశమంతా వారి పీరు మీద మహిళా విద్యాలయాలు, ఆసుపత్రులు సంక్షేమ పధకాలు ఎన్నో వెలిసాయి. వీరి సంప్రదాయాన్ని జిన మతస్తులందరు ఎంతో నిష్టగా పాటిస్తారు.  ఉపవాస దీక్షలు చేస్తారు. దాన గుణం వీరి లో ఎక్కువగా కనపడుతుంది.  విద్య , వైద్య, వ్యాపార , ఇండస్త్రీ రంగాల్లో ప్రవేసించి దేశానికి ఎంతో  సేవ చేస్తున్నారు.   
   జైనులు మహావీరుని అహింస జీవించు ఇతరుల జీవించు సిద్దాంతం నేటి సమాజంలో ఇప్పటికి పాటిస్తున్నారు.    
మహావీరుడు స్త్రీలు తమకి ఇష్టం లేని వివాహ జీవితాన్ని వద్దు అని తెలిపే హక్కు వుందని వారు ఇష్ట పాడితే సన్యాసిని గా జీవించ వచ్చని అనేవారు. స్త్రీలకి భావ స్వేచ్ఛని ఇచ్చారు.  జైన మతం లో స్త్రీల పాత్ర ఎంతో ఉన్నతంగా  చిత్రించ బడింది  తీర్ధంకరులకి మాతృ మూర్తులుగా, భర్తలకి స్పూర్తినిచ్చే భార్యలుగా, తమ వ్యక్తిత్వంతో వ్యాపార రంగం లో వున్నత శిఖరాలకి చేరుకున్న మహిళలు వున్నారు.  ఆమె వ్యక్తిత్వం ఎక్కడికి వెళ్ళిన గౌరవించ బడుతుంది. స్వాద్విమణులు, స్రామిక్ లు సమాజం శ్రేయస్సుకోసం   ఆధ్యాత్మికం గా తమ ధ్యేయాన్ని చేరుకుంటారు.   

Friday, April 12, 2013


శ్రీ శ్రీ శ్రీ మారుతి సేవేంద్ర సరస్వతీ స్వామి
(ధూళిపాళ )




ఈ రోజు 13 ఏప్రిల్ న (తారీకుల ప్రకారం)  శ్రీ శ్రీ శ్రీ మారుతి సేవేంద్ర సరస్వతి స్వామీ నిర్యాణం చెందిన రోజు .  పూర్వాశ్రమం లో  శ్రీ ధూళిపాళ  సీతారామశాస్త్రిగా అందరికి సుపరిచితులు. వారిని 2001 లొ ఒక పత్రిక ప్రతినిధిగ గుంటూర్ లో కలిసినపుడు వారి అనుభవాలు చెప్పారు. ఆనాడు వారితో తీసుకున్న ఇంటర్వ్యు లో రామ భక్త హనుమాన్ తో తనకున్న భక్తీ అనుభవం, సినిరంగా గత వైభవాలు ఎన్నో పంచుకున్నారు.  

ఆశ్రమ జీవనం :


శ్రీ మారుతి సేవేంద్ర సరస్వతి స్వామిగా 2001 మే 7న కంచి పీతాధిపతి  శ్రీ శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారి ద్వారా ధూళిపాళ గారు సన్యాసం స్వీకరిమ్చారు. శ్రీ ఆంజనేయ స్వామి భక్తులైన వీరు గుంటూర్ పట్టణంలో శ్రీ అం జనేయస్వామి వారి ఆలయం నిర్మించారు. ఆ ప్రాంతాన్ని మారుతీనగర్ అని పిలువసాగారు. పూర్తిగా ఆధ్యాత్మిక జీవనం గడిపిన శ్రీ స్వామి వారు ప్రముఖ సిని నటులు అయిన శ్రీ ధూళిపాళ గా అందరికి సుపరిచితులు. సన్యాసాశ్రమం స్వీకరించినప్పటి నుంచి మానవ సేవే మాధవ సేవే లక్ష్యం గా ఆధ్యాత్మిక జీవన పధం లోకి అడుగు పెట్టారు. సినీ రంగానికి దూరంగా వున్నారు.  ప్రజాహిత కార్యక్రమాలు చేసారు . శ్రీ ఆంజనేయ స్వామీ వారి ఆలయం నిర్మించట మే కాకుండా కళ్యాణ మంటపం , ధూళిపాళ  కళా వేదిక, ధ్యాన మందిరం కూడా నిర్మించారు. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు.
నటనా ప్రస్తానం :
శ్రీ శంకరయ్య, రత్నమ్మ గార్లు వీరి తల్లి తండ్రులు . 1920 సెప్టెంబర్ 24 న పల్నాడు తాలుకా దాచేపల్లి గ్రామం లో జన్మించారు శ్రీ ధూళిపాళ . బ్రతుకు తెరువుకోసం గుంటూరులో ప్లీడరు గుమాస్తా గ స్టిరపడ్డారు . వారి నట జీవితం 1935 లో నాటకాలలో పాత్రపత్రాలు ధరించటం తో మొదలయింది . 
చింతామణి లో రాధ, శ్రీ కృష్ణరాయబారం లో నళినీ , మల్లమ్మ మొదలైన నాటకాలలోస్త్రీ 
పాత్రలు పోషించిన వీరు 1941లో స్టార్ దియేటర్స్ ని స్తాపించి ఎక్కువగా పౌరాణిక  పాత్రలు వేసేవారు . 1949లో వేసిన శ్రీ కృష్ణ రాయబారం లో దుర్యోధన పాత్ర  వీరి నట జీవితం లో కీర్తి ప్రతిష్ఠలు , అనేక అవార్డులు తెచ్చిపెట్టి నాటక రంగం లోనే రారాజులా నిలిచేలా చేసింది.
సిని రంగ ప్రవేశం :
ఒకసారి చెన్నైలో నాటక పోటీలు జరిగేటప్పుడు జడ్జిగా విచ్చేసిన ఆనాటి నటి శ్రీమతి జి. వరలక్ష్మి గారు వారి ప్రతిభని గుర్తించి సినిమాలలో నటించమని కోరటం జరిగింది . అంతే  కాదు వారిని డైరెక్టర్ అయిన బి.ఎ. సుబ్బారావు గారికి పరిచయం చేసారు . వారి చిత్రం భీష్మ (1962)లో దుర్యోధన పాత్ర పోషించారు . అల వీరి సిని రంగ ప్రవేశం జరిగింది.
విభిన్న పత్రాల విలక్షణ నటులు :
పౌరాణిక పాత్రలైనా శకుని, దుర్యోధన పాత్రలే కాక సాంఘిక పాత్రాలు పోషించి ఎన్నో సువర్ణ, రజిత పతకాలు అందుకున్నారు . నర్తనశాలలో రారాజు పాత్ర , , కునిగా శ్రీకృష్ణ పాండవీయం , దాన వీర శూర కర్ణ, బాల భరతం మొదలైన చిత్రాలలో నటించారు . చారిత్రాత్మక, జానపద, సాంఘిక చిత్రాలలో విలన్ పత్రాలు, కరుణ రసమున్న పత్రాలు పోషించి నలుగురి మెప్పు పొంది దాదాపు 300 చిత్రాలలో నటించారు. కన్నడ, తమిళ భాషా చిత్రాలలో కూడా నటించి ఎన్నో బహుమతులు అవార్డులు పొందారు. ఏక పాత్రాభినయం చేసేవారు . ఆలిండియ రేడియో లో దాదాపు 150 నాటికలలో పాల్గొన్నారు.

రారాజు :


 పౌరాణిక పాత్రలలో ముందుగా సుయోధనుడుగా ప్రసిదులయ్యారు . రావనాసురుడుగా , మైరావణుడిగా నటించి ఆ పాత్రలకి న్యాయం చేకూర్చారు. ఎంచుకున్న పాత్రలో లీనమై నటించే అభినయం , సంభాషణలు పలికే తీరు , గంభీరమైన స్వరం, భిన్నమైన నటనా శైలి వీరిని ఆంధ్రుల గుండెల్లో చిరస్తాయిగా నిలిపాయి . నేటికి శకుని అన్నా, కౌరవ కుల వంశజుడు రారాజు అన్నా ధూళిపాళే!
ఆనాటి మరపురాని అనుభవం 1949లో చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి గారిచే సన్మానం అందుకోవటం మరచిపొలేని అనుభవం అని అన్నారు . బంగారు నటరాజు విగ్రహం , ప్రశంసా పత్రం, శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారు వంటి ఆ సభలో వుండటం ఏంతో ఆనందానిచ్చిమ్దని అనేవారు . తన రంగాస్తల నట జీవితం లో శ్రీ సి.యస్ ఆర్. ఆంజనేయులు , శ్రీ బందా కనకలింగేశ్వర రావు గారు , శ్రీ పీసపాటి వారు మొదలైన మహా మహా నటులతో కలిసి నటించటం కూడా ఎంతో గొప్ప అనుభవం అని అన్నారు .
మంచి రచయిత :
ధూళిపాల గారు మంచి నటులే కాదు రచయితా కుడా! ఎన్నో గేయాలు రచిం చారు. సమాజం లో మంచిని పెంచే ఉద్దేశం తో సమాజం లో దుష్ట శక్తి నిర్మూలనకి , ప్రజలలో సాంఘిక బాధ్యతా పెంపొం దిమ్చుకోడానికి వ్యక్తిగతంగా నమ్మకం పెంచుకోవడానికి , మంచిని ప్రబోధించే గేయాల రచన అంతర్వాణి. సామాన్యులు కూడా పాడుకునే విధంగా మంచి రాగాలతో కట్టబడినాయి.
సిని రంగం:
భీష్మ, మహా మంత్రి తిమ్మరుసు, నర్తనశాల , బొబ్బిలి యుద్ధం. శ్రీ కృష్ణావతారం, ఉమ్దమ్మ బొట్టు పెడతా, ఆత్మీయులు, బాంధవ్యాలు, ఏకవీర, అందాల రాముడు , సీతా స్వయం వరం , దాన వీర శూర  కర్ణ , ఎన్నో చిత్రాలలోని పాత్రలు వారి నటనా కీర్తి కిరీటం లో కలికి తురాయిగా నిలిచాయి.
బిరుదులు :
1968లో రాష్ట్ర ప్రభుత్వం వారి నంది అవార్డు బాంధవ్యాలు చిత్రానికి అందుకున్నారు.
1976 లో రంగ మార్తాండ, 1981లో రంగస్థల రారాజు 1983లో నాటక కళా ప్రపూర్ణ,  1983లో కళా సరస్వతి 84 సువర్ణ ఘంటా కంకణం,  ఇంకా ఎన్నో సత్కారాలు, సన్మానాలు అందుకున్నారు.
1991లో పద్య నాటక శిక్షణ సిబిరాననికి డైరెక్టర్ గా కొంతకాలం ఉన్నారు.  1993లో నాటక అకాడమీకి అద్వైజర్ గా వున్నారు.
ఆ మహా నటుడి సినీ ప్రస్తానంలో వారి నట జీవితం కన్నా ఆధ్యాత్మిక జీవనం సాగిస్తూ శ్రీ శ్రీ శ్రీ మారుతి సేవేంద్ర సరస్వతిగా జగత్ ప్రసిదులై జగత్ కల్యాణం కోసం మంచి కార్యక్రమాలు చేస్తూ , ఆ అభయాంజనేయ స్వామీ భక్తులుగా తమ అంతిమ జీవన యాత్రని తన 88వ ఏట ముగించిన వారికిదే నా నమస్సులు!
జననం  : 24 09 1920
మరణం : 13 4 2007