Search

Wednesday, May 30, 2012

"కలర్స్ అఫ్ జాయ్"

మిత్రులందరికీ 

స్వాగతం... సుస్వాగతం!!

మొట్ట మొదటి సరిగా బెంగుళూరు శ్రీ శ్రీ ఆశ్రమం లో జరగబోతున్న ప్రత్యేక కార్యక్రమం:                                   

"కలర్స్  అఫ్ జాయ్"        

     మే 31 నుండి జూన్ 3 , 2012  వరకు జరగ బోయే ఈ ప్రత్యెక కార్య క్రమంలో శ్రీ శ్రీ రవి శంకర్ గారు స్వయంగా పాల్గొనే ఈ శిక్షణ కార్యక్రమం ఎంతో విలువైనది. ఈ విశేష కార్యక్రమానికి ప్రపంచం నలుమూలల నుంచి 2 ,000  మంది పైగా  చిన్నారులు పాల్గొంటున్నారు. మన ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన 200 యూత్   పాల్గొంటున్నారు.  దీనిని బట్టే  ఈ workshop ఎంత ప్రాధాన్యతని సంతరించుకుంటుందో తెలుస్తోంది 


                                   


ముఖ్యంగా యూత్ ని ఉద్దేశించి నిర్వహించే ఈ కార్యక్రమం యువతకి ఎంతో ఉపయోగం. 

ఈ వర్క్ షాప్ ...   ART excel, YES!, YES 2!  participants కోసం నిర్దేసించబడింది.  

       ఈ వేసవి లో సాధారణంగా తల్లి తండ్రులు తమ పిల్లలన్ని ఏదో వొక విధంగా వారి సమయాన్ని గడపడానికి ప్రత్యేక వేసవి శిబిరాలని ఆశ్రయిస్తుంటారు. వాటి ద్వారా పిల్లలు జ్ఞానం సంపాదించినా ఆటలు మొదలైన వాటి వాళ్ళ అలసి పోతుంటారు.
    నేటి చదువుల మానసిక వత్తిళ్ళ నుంచి దూరం కావటానికి, మానసికోత్సాహం పెంపొందటానికి పిల్లల కోసమే రూపొందించిన ఆర్ట్ అఫ్ లివింగ్ వారు చేపట్టిన బృహత్తర కార్యక్రమమే ఈ "కలర్స్  అఫ్ జాయ్ "
        విస్తారమైన ప్రదేశంలో  చుట్టూ  ఇదు కొండల నడుమ, చక్కని అందమైన  సరస్సు, సహజమైన ప్రక్రుతి వాతావరణం లో ఈ కార్యక్రమం జరుగుతోంది. శ్రీ శ్రీ రవి శంకర్ గారు ఆశిస్సులతో నడిచే ఈవెంట్ ఎంతో అద్భుతం. అమోఘం.
     ఈ ఆర్ట్ ఎక్సెల్ లో ధ్యానం మరియు పరస్పర అవగాహనా ద్వారా  పిల్లల ఆరోగ్యం, జ్ఞాపక శక్తి పెరగటం జరుగుతుంది. వారిలో సృజనాత్మక శక్తి అభివ్రుది చెందుతుంది.  ఏకాగ్ర త పెరుగుతుంది. స్నేహశీలత పెంపొందుతుంది. ప్రతిరోజూ ప్రతి విద్యార్ధి ఎదురుకునే మానసిక ఆందోళన దూరం అవటం, ఆత్మ విశ్వాసం పెరగటం ద్వారా వారు విజయం వేపు అడుగులు వేయగలుగుతారు.
      యువత కి సంబంధిచిన YES వర్క్ షాప్ లో వారిలో యువ శక్తి ని అధికం చేస్తుంది.  ప్రత్యేకమైన శ్వాస పద్ధతుల ద్వారా వారి ఆందోళనలు దూరమవటం, మదిలో చెలరేగే negetive emotions ,  (చెడు భావోద్రేకాలు ) దూరమవుతాయి. 
     YES 2   ...YES  పూర్తి చేసుకున్న వారికోసం నిర్దేసించబడినది అ dynamic vibrant వర్క్ షాప్.  భాద్యతలు,  సమస్యలని అర్ధం  చేసుకోవటం,  తన పై నమ్మకం ఏర్పరచుకోవడం (సెల్ఫ్ కాన్ఫిడెన్సు ) మొదలైనవెన్నో ఈ వర్క్ షాప్ ద్వారా ఏర్పరచుకో గలుగుతారు. 
   ఈ నాలుగు రోజుల "కలర్స్ అఫ్ జాయ్"  కార్యక్రమం లో  meditation,  యోగ వంటివే కాదు....
    సుభాషితాలు చెప్పటం, గీత బోధించటం, పురాణ గాధలు వినిపించటం, ఆశ్రమం విహారాలు, హస్త కళలు నేర్పించటం, సహజ వాతావరణం లో పెరిగే పంటలు గురించిన దర్శనం, వివరణ, గోశాల  దర్శనం,  ప్రత్యేకించి భారత మాట గొప్పతనం ,,,  ఇలా ఎన్నో విషయాలపై చర్చలతో పాటు శ్రీ శ్రీ రవి శంకర్ గారు సన్నిధిలో ఈ వర్క్ షాప్ జరగటం నిజం గా ప్రతి విద్యార్ధి అదృష్టం.   

ఇందులో పాల్గొన్న కొందరి యూత్ అభిప్రాయాల వీడియో క్లిప్పింగ్స్..... 

Tuesday, May 29, 2012

"సత్య మేవ జయతే"


 "సత్య మేవ జయతే" ఇటీవల ఎంతోమందిని ఆలోచింపచేసే టివి   ప్రోగ్రాం 
హిందీ లో ప్రసారమయిన దాన్ని తెలుగులో వచ్చింది. దాన్ని ఆసక్తి కలవారు చూడగలరు.
తెలుగు కన్నా హిందీ లో ఒరిజినల్ వెర్షన్ బాగుంది.

Satyameva Jayathe Hindi
    

సమాజంలో ఎంతో పవిత్రమైన వృత్తిలో  వున్న కొంతమంది  డాక్టర్లు, హాస్పిటల్స్  అమాయకులపై నేటి సమాజంలో 
చేసే అన్యాయం   పై ఈ ఆదివారం 27 5 12  నాడు star plus లో వచ్చిన కార్యక్రమం ఇది.
 లింక్     మీద  క్లిక్   చేయండి   
-- 




Thursday, May 17, 2012

సనాతనం మన హిందూ ధర్మం


  సనాతనం మన హిందూ ధర్మం  


  
                  శ్రీ పీఠం ఆధ్వర్యంలో శ్రీ లలితా సహస్రనామ రహస్య ప్రవచానాల కార్యక్రమం నెల రోజుల పాటు  హైదరాబాద్  నగరంలో జరిగింది.  ఆ సందర్భంలో  ఆర్ష విద్య గురుకుల వ్యవస్తాపకులు అయిన   దయానంద సరస్వతి స్వామి  ఇటీవల నగరానికి విచ్చేసినపుడు   పరిపూర్ణనంద స్వామిజి జగద్గురు వైభవం పేరిట దివ్య పుష్పాంజలి కార్యక్రమాన్ని నిర్వహించారు  శ్రీ  దయానంద సరస్వతి స్వామిజి కి   శృంగేరి శారదాపీఠాధిపతి భారతీతీర్థ మహాస్వామి ఆదిశంకర గౌరవపురస్కారాన్ని అందచేసారు. ఆ సందర్భంగా పరిపూర్ణనంద స్వామిజి తమ గురువుతో పాటు   ఆర్షగురుకులంలో   సన్యాస దీక్ష పొందిన తెలుగు వారైన 13 స్వామీజిలను  వేదిక మీదకు ఆహ్వానించి గౌరవంగా సత్కరించారు.  
               ఈ సందర్భం గా ఆనాటి సభలో స్వామిజి ఆంగ్ల ప్రసంగానికి తెలుగులో పరిపూర్ణనంద స్వామిజి తర్జుమా చేసి అందరికి వినిపించారు. 
" అనాది నుంచి ఈ భూమి మీద ఎన్నో మతాలున్నాయి.  కానీ అందులో కొన్ని మతాలూ అంతరించి పోయాయి  పూర్వకాలంలో కూడా ఒక తీవ్ర తరమైనటు వంటి భావ జాలంతో తన ఉనికిని చాటుకునే దిశగా ఎన్నో మతాలూ  ఈ భూమి మీద పాలన చేసాయి. వాటిల్లో కొన్ని లేవు. . కానీ ఇటీవల కొన్ని కొత్త మతాలూ వచ్చాయి  అవన్నీ తన మనుగడకి తమ ఉనికిని చాటుకోవడం కోసం అవన్నీచాలా తీవ్ర  తరంగ ఒక రకంగా ఉగ్ర రూపం ధరించి   విస్తరించే ప్రయత్నం చేస్తున్నాయి.  కానీ ఈ భూమ్మీద సనాతన మైనటువంటి ఈ హిందూ ధర్మం లేనటువంటి రోజు లేదు .   సనాతనమైన ఈ ధర్మం    అప్పుడు,  ఇప్పుడు  ఉంది . ఎప్పటికి ఉంటూనే వుంటుంది  అందుకే  సనాతనం అని అన్నారు. 
            ఈ భూమ్మీద  సైన్సు అనేది ఒకప్పుడు పుట్టలేదు. భూమితో పాటే ప్రక్రుతి తో పాటే సైన్సు అనేది పుట్టింది.   ఆ సైన్సు అనేది ఏ సైంటిస్ట్ కానీ పెట్టింది  కాదు.   ప్రక్రుతి ఆవిర్భావం నుంచే భూమికి ఆకర్షణ శక్తి ఉంది. ఆ విషయం  ఇప్పుడు న్యూ టన్  చెప్ప్పాడు.  అలాగే   వైజ్ఞానిక దృక్పధంతో  విజ్ఞాన వేత్తలు  కనుగునే ఒక్కొక్క   సారం కూడా ప్రకృతిలో  అనాదిగా  ఉన్న విషయాలనే చెపుతున్నారు.  
 సైన్సు కొత్త కాదు. అలాగే మన వేదాలు కానీ హిందూ వాగ్మయాలు కానీ  ఎవరు పుట్టించింది కాదు.  ఇది  కాలంతో పాటు అనాది నుంచి  వస్తుంది.    కానీ సైన్సు కి వాగ్మయాలుకి వున్నాచిన్న  తేడా ఏమిటంటే . సైన్సు కి పది  ఏళ్ళ క్రితం ఒక సైంటిస్ట్ ఒక ఫార్మలా చెపితే ఇరవై ఏళ్ళ  తరువా త ఇంకో సైంటిస్  దాని మర్చి ఇంకా ఉన్నతమైనది గా మార్పులు చేస్తూ ఉంటాడు.   నలభై ఎళ్ళ   తరువాత రక రకాలుగా మార్పులు చేస్తూ వుంటాడు  ఇలా బెటర్ మెంట్ పొందు తూనే వుంటుంది సైన్సు. కానీమన వేదం శాస్త్రంలో   'అహం  బ్రహ్మస్మి తత్మ్వమసి' అనే వాక్యం చెప్పిన తరువాత దాన్ని మార్చే  మతం లేదు బెట్టేర్మేంట్ చేసే వ్యాక్యం వుండదు.. అదే  సైన్సు కి మన వేదాంతానికి  వున్నా తేడా.  వేదాలు తర తరాల నుంచి  అలానే ఉంది  దాన్ని మార్పులు చేయలేము. భగవంతుడు ఎక్కడో లేదు. ఆణువణువూ ప్రకాశిస్తున్నాడు  అనే సత్యాన్ని మనం ఆచరించి చూపిస్తున్నాం.  
             మన సంప్రదాయం లో ఆలోచిస్తే రుద్రం లో ఒక వ్యాక్యం ఉండి. నమస్తే అస్తు భగవాన్ .అంటే  పరమాత్మా  నీకు నమస్కారం అని. మనం ఎవరైనా కనిపిస్తే నమస్తే అంటాం భగవంతునికి, ఒక వ్యక్తిని వేరుగా చూడని ఏకైక సనాతన హిందూ ధర్మం మనది. ఇతర మతాలలో దేవుడు వేరు, వ్యక్తీ వేరు. కానీ మన భారత దేశం లో ఆవిర్భ వించిన సనాతన ధర్మం  ఏదైతే వుందో అది ఒక్కటే భగవంతుని, వ్యక్తిని వేరుగా కాకుండా సమైక్య దర్సనంగా చూప  గలిగే శాస్త్రం హిందూ ధర్మం మాత్రమే. అటువంటి హిందూ ధర్మం లో పుట్టమంటే అది మన భాగ్యం.    
         చేపలకి నీటిలో  వుంటూ  మునిగి పోకుండా ఎలా ఉండాలో తెలుసు. చేప నీటిలో ఉంటేనే బతుకుతుంది. బయట పడితే మరణిస్తుంది. దాని ఉనికి కోల్పోతుంది  అలాగే మనం హిందువుగా బతికున్నంత కాలం ఈ భారత  భూమిలో మనకి మనుగడ. ఉనికి నిలబడాలంటే హిందువుగానే జీవించాలి.   ఒక హిందువు మాత్రమే తన ధర్మాన్ని మతాన్ని పరి రక్షించుకుంటూ ఇతర మతాలని కూడా బ్రతక నివ్వగలిగే  యోగ్యతా ఒక్క హిందూ మతానికి ఉంది. 
            ఒక హిందువు క్రైష్టవులకి, ముస్లిములకి , నాస్తికుడికి వ్యతిరేకి కాదు. వాటి వాటి ఉనికిని పరి రక్షించగలిగే మతం హిందూ మతం. మనం   అటువంటి సనాతన ధర్మంలో పుట్టాం జీవిస్తున్నాం  అటువంటి సంస్కృతిలో పుట్టాం.,
            మనం ఒక రాయికి మొక్కుతున్నాము అంటే ఆ రాయి లో వున్నది సాక్షాత్తు ఆ శ్రీ మన్నారాయణునుడే  అనే భావనతో వుండటం వల్లే. అలాగే    
   మనం పసుపుకి నీరు చేర్చి ముద్దగా చేర్చి గణపతిగా ఆరాధిస్తాం, ఆవాహయామి అని పూజ అంత చేసిన తరువాత ఆ పసుపు ముద్దని తిరిగి పులుసు వంటి వంటల్లో  ఉపయోగించం. కారణం,  ఆ పసుపుని మనం గణపతిగా భావి స్తున్నాం కనుక.  మన భావనలో, భావుకతలో పరమాత్మే  నిండి వున్నాడు.   ఇటువంటి  గొప్ప సంస్కృతి మనది. " అంటూ తన ప్రసంగాన్ని ముగించారు. 
వారు తన ప్రసంగంలో సనాతనమైన మన హిందూ ధర్మాన్ని గురించి వివరించారు. 
  శ్రీ  దయానంద సరస్వతి స్వామిజి కి  ఆరోగ్యం సరిగా లేకున్నా కోయంబత్తుర్ నుంచి మన నగరానికి విచ్చేసి మన జంట నగరాల వాసులకు తమ అనుగ్రహ భాషణం తో అలరించారు. ఆరోజు ఉదయం కూడా వారు తమ ఆశ్రమం లో పండితులకి సంస్కృత పాఠాలు తీసుకుని వచారు. వారికి వేదాలంటే ఎంతో మక్కువ. వేదాలే వారి ఊపిరి, ఆహరం, నీరు కూడా...  స్వామి దయానంద ఎందఱో శిష్యుల్ని తయారు చేసారు.  పరిపూర్ణనంద స్వామి నిర్వహించే లలితా సహస్రనామ జ్ఞాన యజ్ఞం చూసి వారు ఆనందంతో ఆనాటి సభలో తాను  కూడా పరిపూర్నానంద నయ్యనని అన్నారు. 













Thursday, May 10, 2012

jiddu krishnamurthy

   










  ప్రముఖ తత్వవేత జిడ్డు కృష్ణ మూర్తి జన్మ దినం 

ప్రముఖ తత్వ వేత్త శ్రీ జిడ్డు కృష్ణ మూర్తి మే, 11 1895 మదనపల్లి లో  జన్మించారు. సంజీవమ్మ నారాయణ దంపతుల అష్టమ సంతానం వీరు.
పది సంవత్సరాల వయసులో తల్లి మరణించింది. వీరు చిన్న తనం లోనే తండ్రి, తమ్ముడు నిత్య నందాతో పాటు మద్రాస్ నగరం లో దివ్య జ్ఞాన సమాజంలో  నివసించేవారు. ఆ సమాజానికి అధ్య క్షు రాలైన డా. అనీబి సెంట్,   లెడ్ బీటర్ అనే ముఖ్య మైన వ్యక్తి ఆడుకుంటున్న కృష్ణమూర్తి లో దివ్య తేజస్సు వుందని గుర్తించారు. వీరే తమ మాస్టర్ కాగలరని  వీరిలో దివ్య శక్తులున్నాయని, వీరే తమ సమాజానికి కాబోయే గురువని గుర్తించారు. అన్నతమ్ములిద్దరిని లండన్ పంపించారు.  కృష్ణ మూర్తి గారిని దత్త తీసుకున్నారు. 
          వీరికి అన్ని రంగాల్లో ప్రత్యేకమైన శిక్షణ ఇవ్వటం ప్రారంభించారు. 
          అనీ బీసెంట్ కృష్ణ మూర్తి గారిని తల్లిలా ఆదరించింది. ప్రేమగా లాలించింది. గురువులా శిక్షణ అందించింది. 
         కృష్ణమూర్తి దివ్య జ్ఞాన సభలకి హాజరవటం, హెరాల్డ్ పత్రికని నడపటం, తారా పరిషద్ నిర్వహించటం చేసేవారు. కొలది కాలం లోనే కృష్ణమూర్తి దివినె సొసైటీ వుంచి వైదొలగి విస్తృతంగా ప్రపంచం అంటా తన పర్యటన సాగించి ఉపన్యాసాలిచ్చెవారు.
       "హృదయానికి ప్రేమ, మేధకు తెలివి ఉన్నాయి ఈ రెండు సమ పాళ్ళలో పెరిగినపుడు సంపూర్ణ వికాసం సిద్ధించి మనిషిని పూర్ణ మానవునిగా తీర్చి దిద్దుతుంది. హృదయం సత్సంబంధాలు కలిగిస్తుంది. సంబంధమే జీవితం. ప్రతి వ్యక్తి కి  సమాజం పట్ల బాద్య త  వుంది." అని అనేవారు.
      కృష్ణమూర్తి గారిని కృష్ణాజి   అనేవారు. హాలండ్ డెన్మార్క్, ఫ్రాన్సు, మొదలైన ఎన్నో దేశాలు చుట్టి వచ్చే వారు. గంభీరమైన తన కంఠం తో ఉపన్యాసా 
లిచ్చేవారు  .  
    కాలిఫోర్నియా లోని ఒహై వాలి లో ఆర్య విహార్ అనే ఆశ్రమం నిర్మించుకున్నారు. 
 కృష్ణ మూర్తి యోగిలా మారారు. అధిక సమయం meditation లో వుండేవారు. 
రోజులు నెలలు గడిచాయి... జ్ఞానోదయమైంది తేజస్సు వెలుగొంద సాగింది.శక్తి పెరిగింది. 
జిడ్డు కృష్ణ మూర్తి దివ్య జ్ఞా న సమాజ స్వర్నోత్శావాలకు మద్రాస్ నగరానికి వచ్చారు.  ఆ సమయం లో తమ్ముని మరణ వార్త తెలిసింది. 
తమ్ముని మరణ వార్త తొలుత క్రుంగ దీసినా. శక్తి పుంజుకొని, జీవితాన్ని ఎదుర్కొన్నాడు. దివినె సొసైటీ స్వర్ణోత్సవ సభలో కృష్ణాజి ప్రపంచ బోధకుడు అయ్యాడని అనిబిసెంట్   ప్రకటించింది. కృష్ణాజి దివినె సొసైటీ కి రాజీనామా చేసి ప్రపంచ యాత్రలకి పయనమై ప్రతి చోట ప్రసంగించేవారు. 
 వీరి ఉపన్యాసాలు ఎంతో తాత్వికతను, విజ్ఞానాన్ని సంస్కృతిని, అందిస్తూ మానవ వికాసానికి తోడ్పదేవిగా ఉండేవి  "నేను మార్పు చెందాను. నా మిత్రుల జీవితాలకు మార్పుని తెస్తాను. ప్రపంచ పురోగతికి సాయపదతాను. నా అంతరమ్గమంతా శక్తి తో నిడినది " అని తెలిపారు. విశ్వ మనవుదయ్యాడు తన ప్రవచనాలతో. కృష్ణమూర్తి ఫౌన్దతిఒన్స ప్రపంచ మంతట వెలిసాయి. 
             1986 సంవత్సరం ఫిబ్రవరి 16  న ఇహలోక యాత్ర చాలించారు. అమర జీవులైనరు శ్రీ కృష్ణ మూర్తి. 

వారి జయంతి సందర్భం గా వారి ఉపన్యాసాలను ఆస్వాదించండి.

   
   

     































































Sunday, May 6, 2012

Budha Purnima

                      ఇవాళ   బుద్ద  పౌర్ణమి   



























Pay no attention to the faults of others,
things done or left undone by others.
Consider only what by oneself is done or left undone.

What we think, we become.

Holding on to anger is like grasping a hot coal with the intent of throwing it at someone else; you are the one getting burned

GOLDEN BUDHA   




GOLDEN BUDHA
 http://images.travelpod.com/users/bl


GOLDEN BUDHA



Buddha Jayanti or also known as Buddha Purnima is the most sacred festivals of Buddhist. Buddha Purnima (Buddha Birthday) is celebrated in remembrance Lord Buddha. Lord Buddha is the founder of Buddhism. This day is the birth anniversary of Lord Buddha. It falls on the full moon of the fourth lunar month (month of Vaisakh) i.e. April or May. This day commemorates three important events of Buddha's life
- His birth in 623 BC.
- His enlightment i.e. attainment of supreme wisdom, in 588 BC.
- His attainment of Nirvana i.e. the complete extinction of his self at the age of 80.

This day is a thrice blessed day.
That is 6 5 2012